పూరీ కనెక్ట్స్  డబుల్ ఇస్మార్ట్ గ్రాండ్ లాంచ్

పూరీ కనెక్ట్స్  డబుల్ ఇస్మార్ట్ గ్రాండ్ లాంచ్

ఉస్తాద్ రామ్, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులని అలరించనుంది. వారి కల్ట్ బ్లాక్‌బస్టర్ 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్' కోసం వీరిద్దరూ మళ్లీ కలిశారు. ఈసారి డబుల్ మాస్, డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతోంది. పూరి కనెక్ట్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విషు రెడ్డి సీఈవో. కోర్ టీమ్, కొంతమంది ప్రత్యేక అతిథుల సమక్షంలో 'డబుల్ ఇస్మార్ట్' లాంచ్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఛార్మి క్లాప్‌ ఇవ్వగా, హీరో రామ్ పోతినేనిపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి స్వయంగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ముహూర్తపు సన్నివేశంలో "ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్' అని రామ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. డబుల్ ఇస్మార్ట్ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుంది.